అషు రెడ్డికి హైకోర్టు షాక్..
హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 08, 2026
హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అషు రెడ్డికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. సుమారు రూ. 9.35 కోట్ల భారీ ఆర్థిక మోసం కేసులో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వచ్చే సోమవారం తమ ముందు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఈ ఆర్థిక లావాదేవీల్లో అషు రెడ్డి పాత్రపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేసిన అధికారులు, ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తుల గురించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు, తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలంటూ అషు రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకూ ఈ మోసానికీ ఎటువంటి సంబంధం లేదని, ఈ కేసును రద్దు చేయాలని (Quash Petition) ఆమె తన పిటిషన్లో కోరారు. అయితే, ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, అషు రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో సోమవారం ఆమె పోలీసుల విచారణకు హాజరు కావడం తప్పనిసరిగా మారింది. ఈ కేసు ఇప్పుడు సెలబ్రిటీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.