ఓలా సంస్థకు భారీ జరిమానా.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు?

Published on: 21 Apr 2026, 10:33 AM
News Article

హైదరాబాద్: ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం ఓలా (Ola) సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. వాహనంలో లోపాలు ఉన్నాయంటూ దాఖలైన కేసును విచారించిన కమిషన్, బాధితుడికి పూర్తి సొమ్ముతో పాటు అదనంగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

అసలేం జరిగింది?

నల్లగండ్లకు చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తి 2023 నవంబర్ 9న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. అయితే, వాహనం కొన్నప్పటి నుండి తరచూ సాంకేతిక సమస్యలు రావడం మొదలయ్యాయి. అనేకసార్లు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో, విసిగిపోయిన బాధితుడు చివరకు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

కమిషన్ తీర్పు ఏంటి?

ఫిర్యాదుదారుడి వాదనలు విన్న కమిషన్, ఓలా సంస్థ సేవా లోపాన్ని గుర్తించింది. బాధితుడికి కింద పేర్కొన్న విధంగా నగదు చెల్లించాలని జరిమానా విధించింది:

  • వాహనం ధర: రూ. 1,19,999
  • ఇన్సూరెన్స్: రూ. 7,243
  • కేసు ఖర్చులు: రూ. 5,000
  • పరిహారం: మరో రూ. 5,000

కస్టమర్లకు సరైన సేవలు అందించకపోతే ఫలితం ఇలాగే ఉంటుందని ఈ తీర్పుతో స్పష్టమైంది. బాధితుడికి న్యాయం జరగడంతో వినియోగదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.