చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా రాఖీ వేడుకలు

Published on: 27 Aug 2026, 04:22 PM
News Article

చౌటుప్పల్, ఆగస్ట్ 27, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రాఖీ పండుగ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని మల్లికార్జున స్కూల్ విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అట్టహాసంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీస్ అధికారులకు, సిబ్బందికి రాఖీలు కట్టి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్, ఎస్‌ఐలు కే. యాదగిరి, అజయ్ భార్గవ్‌లతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బందికి చిన్నారులు ఎంతో ప్రేమతో రాఖీలు కట్టారు. సమాజ రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు అందిస్తున్న సేవలను విద్యార్థులు కొనియాడుతూ తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఐ జి. మన్మధ కుమార్ మాట్లాడుతూ రాఖీ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం పోలీసు శాఖకు, విద్యార్థులకు మధ్య ఉన్న సబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా ఎంతో ఆత్మీయంగా సాగింది.