తిరుమలలో అరుదైన 'పచ్చ నాగు' ప్రత్యక్ష్యం..

Published on: 18 Mar 2026, 01:06 PM
News Article
తిరుమల (హైదరాబాద్ న్యూస్ టైమ్):
కలియుగ వైకుంఠం తిరుమలగిరిపై ఒక అరుదైన దృశ్యం భక్తులను అబ్బురపరిచింది. తిరుమలలోని 'ఆదిశేషు' అతిథి గృహం సమీపంలో ఒక అరుదైన పచ్చ నాగు (Green Vine Snake) ప్రత్యక్షమైంది. స్వామివారి క్షేత్రంలో, అది కూడా ఆదిశేషుడి పేరుతో ఉన్న గెస్ట్ హౌస్ వద్దే పాము కనిపించడంతో భక్తులు దీన్ని ఒక వింతగా, దైవిక సంకేతంగా భావించారు.

చెట్లపై విహారం: ఆదిశేషు అతిథి గృహం ఆవరణలోని చెట్లపై ఈ పచ్చ నాగు విహరిస్తుండటాన్ని గమనించిన భక్తులు మరియు సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పచ్చని ఆకుల్లో కలిసిపోయి ఉన్న ఈ పామును చూడటానికి భక్తులు ఆసక్తి చూపారు.

సురక్షితంగా రెస్క్యూ: వెంటనే టీటీడీ అటవీ శాఖ సిబ్బందికి మరియు స్నేక్ క్యాచర్ (Snake Catcher) కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ అత్యంత చాకచక్యంగా ఆ పచ్చ నాగును ఎటువంటి గాయం కాకుండా పట్టుకున్నారు.

అటవీ ప్రాంతంలోకి: పట్టుకున్న పామును సురక్షితంగా ఒక సంచిలో వేసి, తిరుమల లోని జనవాసాలకు దూరంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.