ప్రేమ విఫలమైందని మేడ్చల్ యువకుడు అమెరికాలో ఆత్మహత్య
దమ్మాయిగూడ, ఆగస్ట్ 25, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ పరిధిలోని శ్రీనివాసనగర్కు చెందిన నాగభైరవ కృష్ణ, విజయలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు సాయిప్రదీప్ అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన ప్రదీప్ అక్కడ పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తూనే, సిద్ధిపేటకు చెందిన ఒక యువతిని ప్రేమించారు. సుమారు తొమ్మిది నెలల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా, మొదట నిరాకరించిన పెద్దలు ఆ తర్వాత వారి వివాహానికి అంగీకరించారు.
అయితే, ఇంతలోనే ఆ యువతి ప్రదీప్కు దూరంగా ఉంటుండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ నెల 21న ఆమెకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన సాయిప్రదీప్ ఆవేశంతో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అన్నతో కలిసి అమెరికాలో ఉంటున్న తమ్ముడు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడంతో దమ్మాయిగూడలోని కుటుంబసభ్యులు, స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.