మొగుడిని చంపి సొంత పొలంలోనే పూడ్చేసిన భార్య..
హైదరాబాద్ న్యూస్టైమ్, నారాయణఖేడ్ - మే 25, 2026: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామంలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది; స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ముత్యంరెడ్డి (36) భార్య కల్పన, ఎల్గోయి గ్రామానికి చెందిన గైని పండరి అలియాస్ చింటూ అనే వ్యక్తితో పెట్టుకున్న అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఈ నెల 16వ తేదీన ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా హతమార్చింది. అనంతరం చనిపోయిన తన సోదరుడికి సమాధి కట్టిస్తామని అబద్ధం చెప్పి జేసీబీ సహాయంతో గ్రామ శివారులోని తన పొలంలో పెద్ద గుంత తవ్వించి భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టడమే కాకుండా, ఏమీ తెలియనట్టు ఈ నెల 18న భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేసింది; అయితే దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానంతో కల్పనను గట్టిగా నిలదీయడంతో ప్రియుడితో కలిసి తానే భర్తను చంపినట్లు ఒప్పుకోవడంతో, హత్య జరిగిన 9 రోజుల తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.