విశాఖ బీచ్లో తెలంగాణ యువతి ఆత్మహత్యాయత్నం
Published on: 14 Jul 2026, 06:43 AM
విశాఖపట్నం, జూలై 14, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో సోమవారం సాయంత్రం తెలంగాణకు చెందిన లావణ్యప్రియ అనే యువతి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్తో ఆత్మహత్యకు యత్నించిన ఆమెను, గమనించిన స్థానికులు మరియు అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో యువతి ముఖం, చేతులు, తల భాగం తీవ్రంగా కాలిపోవడంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు; ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండగా, అసలు ఆమె విశాఖకు ఎందుకు వచ్చింది, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలేమిటి అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.